Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూడెమోక్రసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీచర్ మల్లిఖార్జున్పై సంఘ్పరివార్ శక్తుల దాడి దుర్మార్గమైందని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి సూర్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనపై పొంతన లేని ప్రచారాన్ని చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామిక పద్దతులకు భిన్నంగా వ్యవహరించటం తగదని తెలిపారు.రాజ్యాంగం కల్పించిన వాక్స్వాతంత్రాన్ని ఉల్లంఘించట మేనని పేర్కొన్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాకే పరిమితం కాదనీ, తమ అభిప్రాయాలను బలపర్చని వారిపై ఇలాంటి దాడులకు ఒడిగడ తారని తెలిపారు. ఇది ముమ్మాటికి నియంతృత్వ చర్యేనని పేర్కొన్నారు.