Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చౌమల్లా ప్యాలెస్లో ప్రజల సందర్శనార్థం
- సీఎం కేసీఆర్ నివాళులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎనిమిదో నిజాం నవాబు భర్కత్ అలీఖాన్ ముకర్రమ్ జా బహదూర్ భౌతికకాయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. ఆయన టర్కీలోని ఇస్తాంబుల్ శనివారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. మంగళవారం భౌతికకాయాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు. చౌమహల్లా ప్యాలెస్లో నిజాం నవాబు భౌతికకాయాన్ని ఉంచారు. మంగళవారం సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీజీపీ అంజనీకుమార్ సైతం ముకర్రం ఝాకు నివాళులర్పించారు. ఇదిలా ఉండగా చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మనువడు. ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్లోని మక్కా మసీద్లో ఖననం చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్యాలెస్లో భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చూసేందుకు అనుమతిచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు ముకర్రమ్ జా అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మక్కా మసీదుకు చేరుకున్న తర్వాత నిజాం సమాధుల పక్కనే ముకర్రమ్ జా భౌతికకాయాన్ని ఖననం చేయనున్నారు. ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ఆజాం ఝా, టర్కీ చివరి సుల్తాన్ అబ్దుల్ మజీద్-2 కుమార్తె దురు షెహవర్ దంపతులకు 1933 అక్టోబర్ 6న ముకర్రం ఝా జన్మించారు. 1971 వరకు అధికారికంగా హైదరాబాద్ యువరాజుగా కొనసాగారు.