Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పినరయ్ విజయన్, కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ రాక
- అఖిలేశ్, డి రాజా కూడా
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్కు విచ్చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ మాన్తోపాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ సింగ్ యాదవ్ ఉన్నారు. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రిలోపు వీరంతా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయా రాష్ట్ర మంత్రులు వీరికి స్వాగతం పలికారు. పినరయ్ విజయన్కు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, బేగంపేట ఎయిర్పోర్టులో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్సింగ మాన్కు హోంమంత్రి మహమూద్ అలీ, అఖిలేశ్ సింగ్ యాదవ్కు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఉన్నారు. బుధవారం ఖమ్మం నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ను పినరయ్ విజయన్, అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. కాగా సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా కూడా ఖమ్మం సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. వీరందరికి నగరంలోని ఒక ప్రముఖ హోటల్లో బస ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల రీత్యా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా బీఆర్ఎస్ సభలో పాల్గొంటారు. అలాగే జాతీయ రైతు సంఘాల నాయకులు, రాష్ట్ర మంత్రులు సైతం రానున్నారు.