Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే గ్రూప్-2 రాతపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈనెల 22న ఉదయం 10 నుంచి అవగాహన సదస్సును నిర్వహించనున్నట్టు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెప్ పి క్రిష్ణప్రదీప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని అశోక్నగర్లో ఉన్న తమ అకాడమిలో ఈ సదస్సును నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందులో సీనియర్ అధ్యాపకులతో గ్రూప్-2 సిలబస్, సన్నద్ధత, ప్రణాళిక, నోట్స్ మేకింగ్, సమయపాలన వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.