Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వికలాంగ పిల్లలకు సౌకర్యాలను కల్పించడంతోపాటు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్లు (ఐఈఆర్పీ) సమస్యలను పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సాధారణ బదిలీల తర్వాత ఐఈఆర్పీలకు కూడా బదిలీలు చేపడతామన్నారు. పీఆర్టీయూటీఎస్ ఐఈఆర్పీ యూనియన్ క్యాలెండర్ను మంత్రి గురువారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఐఈఆర్పీ ఉపాధ్యాయులను ప్రాథమిక విద్యలో భాగంగా ఎస్జీటీలుగా కలుపుతూ రెగ్యులరైజ్ చేయాలని మంత్రిని కోరారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఐఈఆర్పీ ఉపాధ్యాయులకు బదిలీలు కల్పించలేదని పేర్కొన్నారు. సాధారణ ఉపాధ్యాయుల బదిలీలతోపాటు తమకూ బదిలీలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ ఐఈఆర్పీ యూనియన్ అధ్యక్షులు ఎస్ వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి కె కిరణ్కుమార్, కోశాధికారి సమ్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధరాచారి తదితరులు పాల్గొన్నారు.