Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఎస్ శాంతి కుమారి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వంద రోజుల పాటు కొనసాగే కంటి వెలుగు కార్యక్రమంలో ప్రపంచరికార్డు సాధించేలా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్ లిబర్టీ ఏవీ కాలేజ్లో కంటివెలుగు కార్యక్రమనిర్వహణను సిఎస్ శాంతికుమారి బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వి, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మహంతి తదితర ఉన్నతాధికారులతో కలసి కంటి వెలుగు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా శాంతి కుమారి మాట్లాడుతూ, 2018లో నిర్వహించిన తొలివిడత కంటి వెలుగు కార్యక్రమంలో దాదాపు 1.57 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించిన ప్రస్తుత కంటివెలుగు కార్యక్రమంలో తొలివిడత రికార్డుని అధిగమించి సరికొత్త రికార్డు సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత కంటి వెలుగును సమర్దవంతంగా నిర్వహించడానికి 15,000 మంది వైద్యారోగ్య సిబ్బందితో కూడిన 1,500 బృందాలు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 12,768 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో 3,788 శిబిరాల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తాయని చెప్పారు. ఈ శిబిరాల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయ ంతో నాణ్యమైన కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి అక్కడికక్కడే రీడింగ్ అద్దాలను అందజేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని నిర్దారిత ప్రాంతాల్లో నేడు కంటి వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయని ఆమె వెల్లడించారు.