Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటువంటి ఆలోచన చేయొద్దు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'నేను ఎవరికీ అనుకూలం కాదు...వ్యతిరేకం కాదు. అలాంటి ఆలోచన ఉంటే పక్కన పెట్టండి. అధిష్ఠానం చెప్పింది చేయడమే నా విధి' అని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్రావు ఠాక్రే పార్టీ నేతలకు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్ జోడో యాత్ర మాదిరిగానే తెలంగాణలో రెండు నెలల పాటు చేపట్టనున్న 'హాత్ సే హాత్' అభియాన్ జోడో కార్యక్రమాన్ని గడప గడపకూ తీసుకువెళ్లాలని సూచించారు. 'ఎముకలు కొరికే చలిలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేశారు. యాత్ర లక్ష్యాలను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది. నేతలంతా ఐక్యంగా హాత్ సే హాత్ జోడో యాత్ర చేయండి. టీపీసీసీ అధ్యక్షులు, ఎనుముల రేవంత్రెడ్డి 50 నియోజక వర్గాలకు తగ్గకుండా యాత్ర చేస్తారు. మిగిలిన సీనియర్లు కూడా 20, 30 నియోజకవర్గాల్లో యాత్ర చేయాలి. వచ్చే ఎన్నికలను దష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ యాత్రను విజయవంతం చేయాలి. అంతా ఐక్యంగా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, అధికారంలోకి రావడం ఖాయం. సమస్యలు ఉంటే చెప్పండి. నాకు ఫోన్ చేయండి. ఎప్పుడూ అందుబాటులోనే ఉంటా. పార్టీకి నష్టం చేసేలా ఎవరూ మీడియా ముందు మాట్లాడొద్దు' అని ఠాక్రే పార్టీ నేతలకు సూచించారు.
ఫిబ్రవరి 6 నుంచి పాదయాత్ర : రేవంత్రెడ్డి
రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి రెండు నెలల పాటు హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగు తుందని టీపీసీసీ అధ్యక్షులు, ఎనుముల రేవంత్రెడ్డి తెలిపారు. యాత్రలో ప్రియాంకగాంధీ లేదా సోనియాగాంధీ ఒక రోజు పాల్గొనేలా సమావేశంలో తీర్మానించినట్టు చెప్పారు. ఈనెల 26న భద్రాచలం నుంచి లాంఛనంగా యాత్రను ప్రారంభించనున్నట్టు రేవంత్ వివరించారు. మూడు సార్లు సమావేశానికి రానివారి నుంచి వివరణ తీసుకుంటామనీ, కీలక సమావేశానికి హాజరుకాని వారిని పార్టీ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీనియర్ నేత నాగం జనార్ధన్రెడ్డిపై అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శిం చారు. అక్రమ కేసులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. నాగర్ కర్నూల్లో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని వెల్లడించారు.
విచ్ఛినకర శక్తుల నుంచి దేశాన్ని రక్షిస్తాం : విక్రమార్క
విచ్చిన్నకర శక్తుల నుంచి దేశాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వాన, చలిని లెక్క చేయకుండా భారత్ జోడో యాత్ర చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈనెల 30న భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్లో భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 26 నుంచి రెండు నెలల పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర జరుగుతుందన్నారు. ప్రజాస్వామిక, లౌకిక వాదులు కాంగ్రెస్ చేసే ప్రయత్నంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.