Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇప్లూ)లో అంజలి అనే విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హర్యానా నుంచి వచ్చి చదువుకుంటున్న ఆమె మరణం పట్ల సంతాపం తెలిపారు. అంజలి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. విద్యార్థుల భద్రత పట్ల కనీసం సెక్యూరిటీ లేకుండా యూనివర్శీటీ యాజమాన్యం వ్యవరించడం సరైంది కాదనీ, ఆమె మరణంపై విచారణ జరిపి నిజానిజాలను నిగ్గుతేల్చాలని కోరారు.