Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరు ఆదివారం వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్తారు. 11 గంటలకు కేస్లాపూర్ చేరుకొని, గిరిజన ఆరాధ్య దైవమైన నాగోబాను దర్శించుకొని, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర శాఖ తెలిపింది. ఈ సందర్భంగా ఆ జిల్లా నేతలు అక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే మధ్యాహ్నం జరిగే సభలో వారు పాల్గొంటారు. సాయంత్రానికి హైదరాబాద్ తిరిగి వస్తారని తెలిపారు.