Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవిష్కరించిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27న 'యువగళం' పేరుతో చేపట్టనున్న పాదయాత్ర పాటను తెలంగాణ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఎన్టీఆర్ భవన్లో ఆవిష్కరించారు. మదనపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పులి స్వరూప్ ఈ పాటకు రూపకల్పన చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు అజ్మీరా రాజునాయక్, తాళ్లూరి జీవన్కుమార్, అధికార ప్రతినిధి బాలసుబ్రమణ్యం, కార్యనిర్వాహక కార్యదర్శి షకీలారెడ్డి, తెలుగురైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి శేఖర్ రెడ్డి, తెలుగుమహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత, టీడీపీ నాయకులు కాసాని వీరేష్, కట్టా సుధీర్ తదితరులు పాల్గొన్నారు.