Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ శాంతికుమారి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. శనివారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్ నుంచి ఈ కార్యక్రమంపై ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన 97,335 మంది కి కండ్లద్దాలను పంపిణీ చేసినట్టు తెలి పారు. అన్ని జిల్లాల్లో ఉన్న బఫర్ టీమ్లను ఉపయోగించుకుని ప్రభుత్వ కార్యాల యాలు, జిల్లా కోర్టు భవన సముదా యాలు, పోలీస్ బెటాలియన్లు, జర్నలిస్టుల కోసం ప్రెస్క్లబ్ల వద్ద ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు. కండ్లద్దాల నిల్వలను రోజువారీగా సరి చూసు కోవాలని అధికారులకు సూచించారు.