Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూటీఎస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 91ని విడుదల చేయడం పట్ల పీఆర్టీయూటీఎస్ హర్షం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి టి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.