Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతమాత మహా హారతిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటిగా మెలగాలనీ, భారతమాత మహాహారతి కార్యక్రమ లక్ష్యం కూడా అదేనని మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్ వెంకయ్యనాయుడు అన్నారు. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో జరిగిన 'భారతమాత మహా హారతి' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని, మాట్లాడారు. భారతీయ సమాజాన్ని వివిధ గ్రూపుల పేరుతో చీల్చే శక్తులు, వ్యక్తులను దూరం పెట్టాలని చెప్పారు. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని దష్టిలో పెట్టుకుని భారత జాతి పునాదులు ఏర్పాటయ్యాయన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ మాట్లాడుతూ భారతదేశ గొప్పతనాన్ని వివరించారు. దేశ యువత పెద్దసంఖ్యలో భారతీయతవైపు ఆసక్తి కనబరుస్తున్నదన్నారు. అన్ని ప్రాంతాల వేష భాషలు, ఆహారపు అలవాట్లను గౌరవించాలని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి, బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్తో పాటు వివిధ రంగాల ప్రముఖులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.