Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈఈ) పోస్టుల భర్తీకి సంబంధించి ఆదివారం నిర్వహించిన రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 1,540 ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించిన పేపర్-1 కు 61,453 (75.36 శాతం) మంది హాజరయ్యారని వివరించారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన పేపర్-2 రాతపరీక్షకు 61,279 (75.14 శాతం) మంది రాశారని తెలిపారు.