Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో బదిలీలు, పదోన్నతులపై సాధారణ పరిపాలన శాఖ గతంలో నిషేధం విధించింది. ఈ మేరకు జీవో-91ను జారీచేయగా, ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ గురువారం రాత్రి జీఏడీ జీవోను విడుదల చేసింది. జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 4 నాటికి అంటే 37 రోజుల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముగియనుంది. మార్చి 5 నుంచి 19వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించనున్నారు. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలపై ఈనెల 15న ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీల సమక్షంలో మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి సమగ్రంగా చర్చించిన విషయం తెలిసిందే. చర్చలు ఫలప్రదం కాగా, తాజాగా సీఎం కేసీఆర్ మార్గదర్శనం, ఆమోదం మేరకు పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది.
ఉపాధ్యాయుల బదిలీలు - పదోన్నతుల షెడ్యూల్ ఇదే...
జనవరి 27 నుండి మార్చి 4 వరకు కొనసాగింపు.
వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా పదోన్నతులు.
ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీలు, పదోన్నతుల కల్పనకు ఎట్టకేలకు కాలపట్టిక విడదలైంది. ఈ జాతర ఈనెల 27 నుండి మార్చి 4 వరకు కొనసాగుతుంది.
జనవరి 27న అన్ని క్యాటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్లైన్ లో ప్రకటిస్తారు.
జనవరి 28 నుండి 30 వరకు బదిలీ దరఖాస్తులు ఆన్లైన్ లో స్వీకరిస్తారు.
దరఖాస్తు హార్డ్ కాపీలను హైస్కూల్ ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈఓలకు, మండల పరిషత్ పిఎస్,యుపిఎస్ ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డిఈఓకు జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 లోపు సమర్పించాలి.
దరఖాస్తుల హార్డ్ కాపీలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు డిఈఓ కార్యాలయంలో సమర్పించడం, పరిశీలన, ఆన్లైన్ లో ఆమోదించటం ఫిబ్రవరి 3 నుండి 6 వరకు
ఫిబ్రవరి 7న డిఈఓ/ ఆర్జేడీ వెబ్ సైట్లలో బదిలీ పాయింట్లతో ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాలు మరియు పదోన్నతుల సీనియారిటీ జాబితాల ప్రకటన
ఫిబ్రవరి 8 నుండి 10 వరకు మూడు రోజులు అభ్యంతరాల స్వీకరణ పరిశీలన, పరిష్కారం.
తుది సీనియారిటీ జాబితాల ప్రకటన మరియు ప్రధానోపాధ్యాయులు బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు ఫిబ్రవరి 11,12 తేదీలు.
మల్టీ జోనల్ స్థాయిలో ప్రధానోపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పున్ణ పరిశీలన ఫిబ్రవరి 13.
ఫిబ్రవరి 14న ఆర్జేడీలచే ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల విడుదల.
ఫిబ్రవరి 15న బదిలీల అనంతరం మిగిలిన ఖాళీల ప్రకటన.
ఫిబ్రవరి 16,17,18 తేదీల్లో అర్హత గలిగిన స్కూల్ అసిస్టెంట్స్ కు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సెలింగ్.
ఫిబ్రవరి 19, 20 తేదీల్లో సబ్జెక్ట్ వారీగా స్కూల్ అసిస్టెంట్స్ ఖాళీల ప్రకటన మరియు బదిలీ ఆప్షన్స్ నమోదు.
ఫిబ్రవరి 21 న ఆప్షన్ల సవరణ, పన్ణపరిశీలనకు అవకాశం
ఫిబ్రవరి 22,23 తేదీల్లో డిఈఓలచే స్కూల్ అసిస్టెంట్స్ బదిలీ ఉత్తర్వులు విడుదల.
ఫిబ్రవరి 24 న స్కూల్ అసిస్టెంట్స్ బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ప్రకటన
ఫిబ్రవరి 25,26,27 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు.
ఫిబ్రవరి 28, మార్చి 1,2 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన మరియు వెబ్ ఆప్షన్స్ నమోదు.
మార్చి 3న ఆప్షన్ల సవరణ, పున్ణ పరిశీలన
మార్చి 4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల.
మార్చి 5 నుండి 19 వరకు డిఈఓ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీల్స్, అభ్యంతరాలను ఆర్జేడీకి, ఆర్జేడీ ఉత్తర్వులపై అప్పీల్స్/ అభ్యంతరాలను డియస్ఈ కి పంపుకోవాలి. సంబంధిత అధికారులు 15 రోజుల్లో వాటిని పరిష్కరించాలి.