Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంసెట్-2023 నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది. వచ్చేనెల మూడో తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆలస్య రుసుం లేకుండా వాటి సమర్పణకు తుది గడువు ఏప్రిల్ పదో తేదీ వరకు ఉన్నది. అదేనెల 12 నుంచి 14వ తేదీ వరకు సమర్పించిన దరఖాస్తుల సవరణకు అవకాశమున్నది. ఆలస్య రుసుం రూ.250తో ఏప్రిల్ 15 వరకు, రూ.500తో అదేనెల 20 వరకు, రూ.2,500తో 25 వరకు, రూ.ఐదు వేలతో మే 2వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించేందుకు గడువున్నది. ఏప్రిల్ 30 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం రాతపరీక్షలు మే ఏడు నుంచి తొమ్మిది వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం రాతపరీక్షలు అదేనెల 10,11 తేదీల్లో నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో ఒకదానికి దరఖాస్తు చేయాలంటే ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు రూ.500, ఇతరులు రూ.900 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు రెండింటికీ దరఖాస్తు చేయాలంటే ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు రూ.వెయ్యి, ఇతరులు రూ.1,800 కట్టాలి. ఎంసెట్ రాతపరీక్షల నిర్వహణ కోసం తెలంగాణలో 16, ఏపీలో ఐదు కలిపి మొత్తం 21 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 55 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇతర వివరాలకు https:eamcet.tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలి. అయితే ఈ ఏడాది ఎంసెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎంసెట్కు దరఖాస్తు చేయాలంటే కనీస మార్కుల నిబంధన మాత్రం అమల్లో ఉన్నది. అంటే ఇంటర్ లేదా తత్సమాన పరీక్షల్లో 45 శాతం మార్కులుంటేనే ఎంసెట్కు దరఖాస్తు చేసేందుకు అర్హు లు. ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి 70 శాతం, ద్వితీయ సంవత్సరం నుంచి వంద శాతం సిలబస్తోనే ఎంసెట్ ప్రశ్నాపత్రాలను రూపొందిస్తారు.