Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేేపు నోటిఫికేషన్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీటెక్, బీఈ, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ ద్వారా 2023-24 విద్యాసంవ త్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్ నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబా ద్రి, వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఓయూ వీసీ డి రవీందర్, ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్ సోమవారం ఈసెట్ షెడ్యూల్ను విడుదల చేశారు. వచ్చేనెల రెండో తేదీ నుంచి ఆన్లైన్లో దర ఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా వాటి సమర్పణకు మే రెండో తేదీ వరకు గడువుందని పేర్కొన్నారు. ఆలస్య రుసుం రూ.500తో మే ఎనిమిది వరకు, రూ.2,500తో అదేనెల 12వ తేదీ వరకు అవకాశముందని సూచించారు. ఈసెట్కు దరఖాస్తు చేయాలంటే ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు రూ.500, ఇతరులు రూ.900 చెలిలంచాలని కోరారు. మే 15 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. మే 20న రాతపరీక్షలుంటాయని వివరించారు. ఇతర వివరాలకు https://ecet.tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.