Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎంఆర్ డెలివరీ త్వరగా పూర్తి చేయడంతో పాటు కొత్త పంట వచ్చే సమయానికి రైస్ మిల్లులు, గోదాములను ఖాళీ చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లోని పౌరసరఫరాల భవన్లో 33 జిల్లాల మేనేజర్లు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల డైరీని ఆవిష్కరించి వారికి హెల్త్ కార్డులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి నిరంతరం అప్రమత్తంగా ఉండి రైతులకు సేవలందించాలని సూచించారు. ధాన్యం సేకరణను 25 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1.41 కోట్ల మెట్రిక్ టన్నులకు పెంచామని గుర్తు చేశారు. వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించి ధరల స్థిరీకరణలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఉద్యోగులకు రూ. 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ని గతేడాది డిసెంబర్ నుంచి ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మెన్ సర్దార్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు.