Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు నోటిఫికేషన్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చేనెల రెండో తేదీ నుంచి ప్రారంభం కానుంది. సోమవారం హైదరాబాద్లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఓయూ వీసీ డి రవీందర్, లాసెట్ కన్వీనర్ బి విజయలక్ష్మి షెడ్యూల్ను విడుదల చేశారు. బుధవారం లాసెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. లాసెట్ దరఖాస్తు చేయాలంటే ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు రూ.600, ఇతరులు రూ.900, పీజీలాసెట్కు దరఖాస్తు చేయాలంటే ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు రూ.900, ఇతరులు రూ.1,100 కట్టాలని పేర్కొన్నారు. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసేందుకు ఏప్రిల్ ఆరు వరకు గడువుందని వివరించారు. ఆలస్య రుసుం రూ.500తో అదేనెల 12 వరకు, రూ.వెయ్యితో 19 వరకు, రూ.రెండు వేలతో 26 వరకు, రూ.నాలుగు వేలతో మే మూడో తేదీ వరకు అవకాశముందని తెలిపారు. అదేనెల 16 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోచ్చని సూచించారు. మే 25న లాసెట్ రాతపరీక్షలుంటాయని వివరించారు. ఇతర వివరాలకు https://lawcet.tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.