Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతుల పేరిట రాజకీయం చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. అకాలవర్షాలకు పంటనష్టంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖపై స్పందించిన మంత్రి నాలుగేండ్లలో కాంగ్రెస్ ఎంపీలు రైతాంగ సమస్యలపై ఎన్ని దీక్షలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అకాలవర్షాల గురించి నాలు గు రోజుల ముందు నుంచే ప్రభుత్వం అధి కారులను అప్రమత్తం చేసిందని తెలి పారు. వర్షాలు కురిసిన 24 గంటల్లోపే వికారాబాద్ జిల్లాలో పర్యటించామని తెలిపారు. దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించి నట్టు పేర్కొన్నారు.