Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమగ్ర పంటల బీమా పథకాన్ని తేవాలి : సీఎంకు బండి లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. అకాల వర్షాలు, ప్రకృతి వైఫరీత్యాల మూలంగా నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర పంటల బీమా పథకాన్ని తేవాలని కోరారు. సోమవారం ఈ మేరకు సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకుపైగా పంట దెబ్బతిన్నట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ఇప్పటి వరకు సమగ్ర పంటల బీమా పథకాన్ని రూపొందించకపోవడం సిగ్గు చేటని తెలిపారు.