Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శోభకృత్ నామ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో ఉగాది పండుగను జరుపుకోవాలన్నారు. ఉగాది పండుగ నేపథ్యంలో బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో పంచాంగశ్రవణం జరుగుతుందని అన్నారు. పార్టీ శ్రేణులంతా హాజరు కావాలని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.