Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నాపై మోడీ చేసిన వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకునే ఆలోచనతో ఉన్నట్టు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్లో యువజన కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్తో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ మాట్లాడేవన్నీ వాస్తవాలేనన్నారు. కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏంటో త్వరలోనే తెలుస్తోందన్నారు. రాహుల్ అడిగే ప్రశ్నలకు బీజేపీ సర్కారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నటుడు షారుఖ్ఖాన్ ముస్లిం కాబట్టే ఆయన కొడుకుపై డ్రగ్స్ అభాండాలు వేసి అదానీ విషయాలు పక్కతోవ పట్టిస్తున్నారని చెప్పారు. రాహుల్ అడిగిన ప్రశ్నలనే తాను అడుగుతున్నట్టు తెలిపారు.