Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజును ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పరామర్శించారు. శుక్రవారం వారు జయరాజుకు ఫోన్ చేసి మాట్లాడారు. జయరాజు కొడుకు ప్రశాంత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకున్న రాఘవులు, శ్రీనివాసరావు ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. ప్రశాంత్ ఎలా మరణించాడనే విషయాలను అడిగి తెలుకున్నారు. ఎదిగిన కొడుకు మరణించడం తీరని లోటని, ఆ బాధ నుంచి కోలుకోవడం కష్టమన్నారు. మానసికంగా కుంగిపోకుండా కాస్త మనోధైర్యంతో ఉండాలని సూచించారు. రోడ్ల విస్తరణ జరపకపోవడం, క్రాసింగ్ వద్ద సిగల్ వంటివి లేకపోవడం వల్ల హైవేలపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.