Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన చల్లా వెంకట్రామ్రెడ్డి, దేశపతి, నవీన్రావులతో శుక్రవారం శాసనమండలిలోని తన ఛాంబర్లో మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఏవీఎన్రెడ్డితోనూ గుత్తా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, కౌశిక్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు, బీఆర్ఎస్ఎల్పి కార్యదర్శి రమేష్రెడ్డి తదితరులు ఉన్నారు.