Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యావరణాన్ని పరిరక్షించండి:రెడ్కో చైర్మెన్ సతీష్రెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం యాదగిరి గుట్టలో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో తొలి ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రం ప్రారంభమైంది. శుక్రవారం సురేంద్రపురి సమీపంలో ఏర్పాటు చేసిన చార్జింగ్ కేంద్రాన్ని రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివద్ధి సంస్థ (రెడ్కో) చైర్మెన్ వై సతీష్రెడ్డి రిబ్బన్ కట్చేసి లాంఛనంగా ప్రారంభించారు. దేశంలో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ మోడల్)తో ఏర్పాటు చేసిన మొదటి చార్జింగ్ కేంద్రం ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా సతీష్రెడ్డి మాట్లాడుతూ యాదాద్రికి ఎలక్ట్రిక్ వాహనాల్లో వచ్చే భక్తులు తమ వాహనాలు చార్జింగ్ చేసుకునేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మార్కెట్ ధర కంటే తక్కువ యూనిట్ ధరతో వాహనాలు చార్జింగ్ చేసుకునే వీలు ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక వసతులు పెంచేందుకు రెడ్కో సంస్థ కషి చేస్తున్నదని అన్నారు. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లోనూ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్లో రెడ్కో సంస్థ సొంతంగా చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదనీ, కొద్ది రోజుల్లోనే ఇవి వాహనదారులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఎలక్ట్రిక్ వాహనాల కొను గోలుపై మరింత ఆసక్తి చూపాలని కోరారు. కార్యక్రమంలో వడాయిగూడెం సర్పంచ్ పోశెట్టి, చార్జింగ్ కేంద్రం యజమాని జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.