Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హుస్నాబాద్
భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాకే సర్వే పనులు మొదలుపెట్టాలని అధికారులను భూనిర్వాసితులు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో నిర్మించనున్న గౌరవెల్లి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా గురువారం అధికారులు భూసర్వే చేసేందుకు వచ్చారు. గుడాటిపల్లి, తెనుగుపల్లి గ్రామాల భూనిర్వాసితులు అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొదట భూములు కోల్పోయిన వారికే పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్ ఎత్తు పెంచితే భూములకు ఎంత పరిహారం ఇస్తారో ముందే ప్రకటించాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. కలెక్టర్, ఎంపి, ఎమ్మెల్యే వచ్చి సమావేశం నిర్వహించి తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు వెనుదిరిగారు.