Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ బోయిన్పెల్లి వినోద్కుమార్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
- మాన్వాడలో ఆనందరావు స్తూపం ఆవిష్కరణ
నవ తెలంగాణ - బోయిన్పెల్లి
పెత్తందారులు, భూస్వాములను పల్లెల నుంచి తరిమింది కమ్యూనిస్టూలేనని కరీంనగర్ ఎంపీ బోయిన్పల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా బోయిన్పెల్లి మండలం మాన్వాడలో కమ్యూనిస్టు సీనియర్ నాయకులు, సిరిసిల్ల తొలి లెఫ్ట్ ఎమ్మెల్యే జోగినిపెల్లి ఆనందరావు స్తూపాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డితో కలిసి గురువారం ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడారు. నిజాం రజాకారులు, దొరల బానిసత్వపు చర్యలను ఆనందరావు తిప్పికొట్టారని కొనియాడారు. ప్రజల్లో గుర్తింపు అనేది కేవలం ప్రజాసమస్యలపై పోరాడుతూ నిత్యం ప్రజాక్షేమం కోసం పరితపించే వారికే వస్తుందన్నారు. వందలాది ఎకరాల భూమి, స్థిరాస్తులను వదిలిపెట్టి ఉన్నతవర్గంలో పుట్టిన ఆనందరావు ప్రజలపక్షాన బానిసత్వాన్ని తొలగించేందుకు పోరాడారని పేర్కొన్నారు. సిరిసిల్ల, మెట్పెల్లి నియోజకవర్గంలో రెండుమార్లు ఎమ్మెల్యేగా సేవలందించారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామిడి శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.