Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిటీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ : లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యా యం అందించేందుకు ఉమ్మడి హైకోర్టు వడివడిగా అడుగులు వేస్తోంది. సంస్థ ఆస్తులు వేలం వేసేం దుకు విధి విధానాలు రూపొందించాలని జస్టిస్ టిసి హెచ్ సూర్యారావు నేతృత్వంలోని త్రిసభ్య కమి టీని హైకోర్టు ఆదేశించి ంది. తదుపరి విచారణను గురువారా నికి వాయిదా వేసింది. తమను మోసం చేసిన అగ్రిగోల్డ్ యాజమాన్యంపై చర్య తీసుకోవ డమే గాక తమకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తూ తెలంగాణ అగ్రి గోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అండాలు రమే ష్తో పాటు మరో 30 మంది దాఖలు చేసిన పిటిష న్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బొసలే, జస్టిస్ ఎస్వీ భట్టితో కూడిన ధర్మాసనం సోమవారం మరోమారు విచారించింది. ఈ సంద ర్భంగా పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది కె శ్రావణ్కుమార్ వాదనలు వినిపించారు. సంస్థ యాజమాన్యం బినామి పేర్లపై ఉన్న ఆస్తులను ఇప్పటికే విక్రయించిందని, మరి కొన్ని ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నిస్తోందని కోర్టుకు నివేది ంచారు. ఈ సందర్భంగా జస్టిస్ బొసలే జోక్యం చేసుకుని ఆస్తులను వేలం వేసి బాధితులకు అప్పగిద్దామని, ఎలా వేలం వేయాలో సూర్యారావు కమిటీ విధి విధానాలు రూపొందించా లని ఆదేశాలు జారీ చేశారు. కమిటీ విధి విధానాలు వచ్చాక ఆస్తులు వేలం వేసేందుకు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.