Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి ఎం.డి.గౌస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఎంసీసీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి ఎం.డి.గౌస్ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ స్వదేశీ సంక్షేమం పేరుతో విదేశీ కాలయాపన చేస్తున్నారని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ పేరుతో మాటల గారడీ చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వాలు పెట్టుబడి దారీ, కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యాలకు దోసోహమై, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశా యన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశాల్లో 'ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై' ప్రజల భాగస్వామ్యంతో కూడిన ప్రత్యేక్ష పోరాటాలకు తగిన కార్యాచరణ రూపొందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.