Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత్తయ్య అరెస్టుపై ఉన్న స్టేను ఎత్తివేయాలని హైకోర్టులో ఎసిబి పిటీషన్
- విచారణను 16కు వాయిదా వేసిన కోర్టు
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపి కొద్ది రోజులకే చల్లబడ్డ ఓటుకు నోటు కేసులో తిరిగి కదలిక వచ్చింది. కొన్ని రోజులుగా చడీచప్పుడు లేకుండా ఉన్న ఈ కేసు దర్యాప్తులో శుక్రవారం కొంత పురోగతి కనిపించింది. ఈ కేసులో నాలుగవ నిందితుడు జెరుసలెం మత్తయ్య తనను అరెస్టు చేయకుండా పొందిన స్టేను ఎత్తివేయాలని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) హైకోర్టులో పిటీషన్ వేసింది. తాము ఎసిబి కోర్టులో సమర్పించిన ఛార్జిషీటులో ఇతని పేరు కూడా ఉన్నదని, ఈ కేసులో ఇతన్ని విచారించాల్సిన అవసరం ఉందని ఎసిబి తన పిటిషన్లో పేర్కొంది. అంతేగాక ఈ కేసులో నుంచి తన పేరును కొట్టివేయాలని మత్తయ్య పెట్టుకున్న స్క్వాష్ పిటీషన్ను కూడా కొట్టి వేయాలని ఎసిబి కోరింది. దీనిపె కౌంటర్ పిటీషన్ వేయాలని మత్తయ్య తరపు న్యాయవాదిని ఆదేశించిన కోర్టు 16వ తేదీకి విచారణను వాయిదా వేసింది.