Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరంగల్ లోక్సభ ఉపఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న నల్లాసూర్యప్రకాశ్కు మద్దతుగా వైఎస్సార్సిపి అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి ప్రచారం నిర్వహించబోతున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు నాలుగురోజులు పాటు ఆయన ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆపార్టీ తెలంగాణ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. టిఆర్ఎస్తో పాటు బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వరంగల్లో వైఎస్సార్సిపికి విజయాకాశాలు ఉన్నాయన్నారు.