Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రభుత్వం పదే పదే ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని టిడిపి, బిజెపి ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మకు ఫిర్యాదు చేశారు. ఈవిషయమై అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి చెప్పినా, పట్టించుకోవడం లేదన్నారు. నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంటే, అధికార టిఆర్ఎస్ నాయకులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రభుత్వ ఉత్సవాల్లో అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రొటోకాల్ను పక్కనబెడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యేలు టి.ప్రకాష్గౌడ్, జి.సాయన్న, మాగంటి గోపినాద్, బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్రావు సిఎస్ను కలిసినవారిలో ఉన్నారు.