Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు తరలింపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గృహ నిర్మాణ ఉద్యోగులను డిప్యూటేషన్పై పంపించేందుకు సర్కారు ఆదేశాలు సిద్ధమవుతున్నాయి. కార్పొరేషన్కు ప్రభుత్వం కొత్తగా పనులు అప్పగించక పోవటంతో ఆ ఉద్యోగులకు పని లేకుండా పోయింది. ఈ శాఖలో పని లేకపోవడంతో ఇతర శాఖలకు తాత్కాలిక బదిలీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులకు చేతి నిండా పని లేదన్న సాకు చూపి వారిని బదిలీ చేసేందుకు రెడీ అయిపోయింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీలలో సివిల్, సానిటేషన్ విధుల నిర్వహణ కోసం గృహ నిర్మాణ కార్పొరేషన్కు చెందిన 300 మంది శాశ్వత ఉద్యోగులను తరలించనుంది. ఈమేరకు మున్సిపల్ శాఖ గృహ నిర్మాణ శాఖకు లేఖ రాసినట్టు తెలిసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన గృహ నిర్మాణ కార్పొరేషన్ అందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దశల వారీగా కార్పొరేషన్ ఉద్యోగులను కుదిస్తున్న సర్కారు...తాజాగా మరో 300 మంది ఉద్యోగులను తరలించేందుకు సిద్ధమవుతున్నది. అందుకు సంబంధించిన ఆదేశాలు వారంలో రాబోతున్నాయి. ఉద్యోగులను ఇతర శాఖలకు తరలించడానికి బలవంతం చేయకపోయినా దశలవారీగా పంపించడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డిప్యూటేషన్ పంపించిన తర్వాత తిరిగి రప్పిస్తుందన్న గ్యారంటీ లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇండ్ల నిర్మాణంలో కీలక భూమిక పోషించిన ఏఈ, డీఈలను తొలి విడతగా పంపించాలని నిర్ణయించింది. ఈ తర్వాత మరికొంత మందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయనుంది. డిప్యూటేషన్పై ఆప్షన్లు ఇచ్చి ఉద్యోగుల ఆమోదం తీసుకుని బదిలీ చేయాలని నిర్ణయించింది. పైకి తాత్కాలిక బదిలీలు అని చెబుతున్పటికీ భవిష్యత్తులో ఈ ఉత్తర్వులను శాశ్వత బదిలీలుగా మారుస్తారని ఉద్యోగ సంఘం నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గృహ నిర్మాణ కార్పొరేషన్ ఉద్యోగులకు ఈ బడ్జెట్లో జీతభ త్యాలకు నిధులు కేటాయిం చకుండా భారీ కోత విధించింది. జీతాలకు సరిపడ బడ్జెట్ లేకపోవడంతో జీతాలు ఇవ్వలేమని, వెంటనే డిప్యూ టేషన్పై పోవాలని ఉన్నతా ధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. గతం లోనే 700 మంది ఔట్సోర్సింగ్ ఉద్యో గులను మిషన్కాకతీయ, మిషన్ భగీరథ పనుల కోసం బదిలీ చేసింది. గడువు ముగిసిందని ఇటీవల 1187 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసింది. ప్రస్తుతం ఆ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. దీంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులంతా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయిప్పటికీ వారి సమస్యకు పరిష్కారం లబించలేదు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న డబుల్ బెడ్ రూమ్ పథకం నిర్మాణాన్ని కార్పొరేషన్కు ఇవ్వడం లేదనే సంకేతాలిచ్చింది. ఈ పథకాన్ని ఇంకొక సంస్థకు అప్పగించడం ద్వారా కార్పొరేషన్కు పనిలేకుండా పోతున్నది. సహజంగానే కార్పొరేషన్ పనులు ఇవ్వకపోవడంతో అందులో పని చేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతోంది.