Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుష్కరాల ఏర్పాట్లు పూర్తి
- మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తుమ్మల
నవతెలంగాణ-భద్రాచలం
రాష్ట్రంలో ఈ నెల 14 నుండి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు 106 పుష్కరఘాట్లు నిర్మించా మని దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్రెడ్డి, రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాచలంలో శుక్రవారం పుష్కరఘాట్లను పరిశీలించిన అనంతరం వారు విలేకరులతో మాట్లా డారు. ప్రభుత్వం రూ.600కోట్లతో పుష్కర పనులు చేసిందని, బాసర నుండి భద్రాచలం వరకు 106 పుష్కరఘాట్లను నిర్మించినట్లు తెలిపారు. పుష్కరాల సందర్భంగా రహదారుల నిర్మాణం తక్షణమే చేపట్టేం దుకు తన శాఖ నుండి రూ.100కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2300 బస్సులు, 134 రైళ్లను నడుపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నుండి వచ్చే భక్తులకు హెలికాఫ్టర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎక్కువమంది భద్రాచలం వచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేశామ న్నారు. శనివారం మాక్ గోదావరి పుష్కరాలు నిర్వ హించనున్నట్లు మంత్రి వివరించారు. పుష్కరాల సమయంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. గజ ఈతగాళ్ళను సిద్ధంగా ఉంచామన్నారు. వారి వెంట ఆర్డీఓ ఆర్ అంజయ్య, ఇరిగేషన్ ఇఇ సుధాకర్, పిఆర్ఎస్ఇ గంగారెడ్డి, ఆర్అండ్బి ఎస్ఇ సతీష్, భద్రాచలం ఏఎస్పీ ఆర్ భాస్కరన్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్బాబు, ఇఓ జ్యోతి తదితరులున్నారు.