Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫారెస్ట్ రేంజ్ అధికారుల (ఎఫ్ఆర్వో) ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల వయో పరిమితిని మూడేండ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంబంధిత ఫైలుపై సీఎం కె చంద్రశేఖర్రావు బుధవారం సంతకం చేశారు. ఈ మేరకు అటవీ శాఖ అధికా రులు బుధవారం టీఎస్పీఎస్పీ లేఖ రాశారు. 28 సంవత్స రాల వయస్సు మూలంగా తాము ఎఫ్ఆర్వో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకో లేని పరిస్థితి ఉందని ఇటీవల నిరుద్యోగ అభ్యర్థులు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామ న్నను కలిసి నిరుద్యోగ అభ్యర్థులు తమ గోడును విన్నవించుకున్నారు. వినతి పత్రం సైతం సమర్పించారు. ఈ విషయాన్ని మంత్రి వెంటనే సీఎం కేసీఆర్ దష్టి కి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ వయోపరిమితిని 28 నుంచి 31 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు . దరఖాస్తు గడువును పెంచాలని టీఎస్పీఎ స్సికి సైతం అధికారులు బుధవారం లేఖ రాశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగిందని మంత్రి చెప్పారు.