Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీక్ డిమాండ్ 9,510 మెగావాట్లు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. గత మూడు రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో ఈ సీజన్లో అత్యధిక వినియోగం నమోదైంది. గత సంవత్సరం ఇదే రోజు 6,357 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా, బుధవారంనాడు పీక్ డిమాండ్ 9,510 మెగావాట్లకు చేరింది. డిమాండ్ పెరిగినా డిస్కంలు, ట్రాన్స్కో ఎక్కడా విద్యుత్ అంతరాయాలు లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టింది. వచ్చే రెండు రోజుల్లో వాతావరణ మార్పులతో ఉబ్బరం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పీక్ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు ట్రాన్స్కో వర్గాలు అంచనా వేస్తున్నాయి.