Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సమగ్ర భూపంపిణీ జరగాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు కూలీ సంఘం డిమాండ్ చేశాయి. బుధవారం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనె 19న జరగనున్న రాష్ట్రస్థాయి భూసదస్సుకు సంబంధించిన కరపత్రం, పోస్టర్ను రెండు సంఘాల నాయకత్వం ఆవిష్కరించింది. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘుం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. నాగయ్య, అధ్యక్షులు బి.ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, జాతీయ నాయకులు నారి ఐలయ్య, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి డి. రాజేశ్, రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.గోవింద్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకన్న ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగయ్య విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. మాటలు కోటలు దాటాయి గానీ, చేతలు గడప దాటలేదని ఎద్దేవా చేశారు. కోనేరు రంగారావు కమిటీ దాదాపు 25 లక్షల ఎకరాల భూమి రాష్ట్రంలో అందుబాటులో ఉందని తేల్చిందన్నారు. వాటి ఆధారంగా భూములు పంచాలని డిమాండ్ చేశారు.