Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 లక్షల మొక్కలు నాటేందుకు నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాడిరైతుల సొసైటీల ఆధ్యర్యంలో ఈనెల 27 నుంచి హరితహారం నిర్వహించనున్నట్టు సీఎం కార్యాలయ అధికారులు తెలిపారు. సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి భూపాల్రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ సోమవారం ఆయా పాడీ రైతుల సొసైటీలు, డైరీల ప్రతినిధులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారం గురించి చర్చించారు. విజయా డైరీ, ముల్కనూరు డైరీ, కరీంనగర్ డైరీలో రెండు లక్షల మందికిపైగా పాడి రైతులు సభ్యులుగా ఉన్నారని, ఒక్కో రైతుకు ఆరు మొక్కల చొప్పున ఇచ్చి నాటించాలని నిర్ణయించారు. దాదాపు 12 లక్షల మొక్కలు నాటించేందుకు ప్రణాళిక తయారుచేసినట్టు వివరించారు. దసరా పండుగ నేపథ్యంలో ఈనెల 27 నుంచే అమలుచేయనున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి డాక్టర్ మనోరంజన్, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, అదనపు పీసీసీఎఫ్ ఆర్ఎం దోబ్రీయాల్ తదితరులు పాల్గొన్నారు.