Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రూప్-2 అభ్యర్థులకు గురువారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల 27వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. గ్రూప్-2 ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ జేఎన్టీయూ హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల హాల్టికెట్ల నెంబర్ల వారీగా ఏయే తేదీల్లో హాజరుకావాలో పూర్తి వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ను సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు. రాష్ట్రంలో 1,032 గ్రూప్-2 పోస్టులు 2016, నవంబర్ 11,13 తేదీల్లో రాతపరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. గ్రూప్-2కు 7.89 లక్షల మంది దరఖాస్తు చేయగా, రాతపరీక్షలకు 5.17 లక్షల మంది హాజరయ్యారు. 1:3 నిష్పత్తి చొప్పున 3,147 మంది అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది. గతంలో ఒకరోజు చేపట్టిన ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థులు మళ్లీ రావాల్సిన అవసరం లేదని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎ వాణీప్రసాద్ స్పష్టం చేశారు.