Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కలెక్టరేట్
యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని విద్యానగర్లో గల ఓ ఇంట్లో బుధవారం భారీ చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. భువనగిరిలోని విద్యానగర్లో గల ఓ అపార్టుమెంట్లో కోమటిరెడ్డి సుభద్ర నివాసం ఉంటోంది. పదిరోజుల కింద ఇంటికి తాళం వేసి హైద్రాబాద్లో ఉంటున్న కుమారుని వద్దకు వెళ్లింది. అయితే అపార్ట్మెంట్లో సుభద్ర ప్లాట్ డోర్ తెరిచి ఉండటాన్ని గమనించి చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే క్లూస్టీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరించారు. చోరీ జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. విషయం సుభద్రకు తెలియజేయడంతో ఆమె హుటాహుటిన ఇంటికి చేరుకుంది. ఇంట్లో ఉన్న సుమారు 30 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ. 50 వేల నగదు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీపీ మోహన్ రెడ్డి, పట్టణ ఎస్సైలు రాజు, విజయకృష్ణలు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.