Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భవన, ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు గానూ ఈనెల 16న స్క్రీనింగ్ కమిటీ తమకు చేరిన దరఖాస్తుల ను పరిశీలించింది. భవన నిర్మాణ రంగాల్లో పనిచేస్తు ప్రమాదాల్లో మరణిం చిన, గాయపడిన కార్మికులు, మహిళా కార్మికులు ప్రసూతి ఖర్చులకు గానూ అర్హులైన కార్మికులకు రూ.20,30.000లను హోంశాఖ, కార్మిక సంక్షేమ శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి గురువారం చెక్కులను అందజేశారు.