Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోహన్ మృతికి తమ్మినేని సంతాపం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ కార్టూనిస్టు మోహన్ మరణం పత్రిక, కార్టూన్ రంగాలకు తీరనిలోటని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకట నలో పేర్కొన్నారు. ఆయన మరణంపట్ల తీవ్ర సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పాలకవర్గాల దోపిడీకి వ్యతిరేకంగా మోహన్ తన కార్టూన్లను సంధించారని పేర్కొన్నారు.
ఏఐటీయూసీ సంతాపం
మోహన్ మరణంపట్ల ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్రావు ఒక ప్రకటనలో తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. యుద్ధోన్మాదానికి, సామ్రాజ్యవాదానికి, జాతి వివక్షకు వ్యతిరేకంగా మోహన్ కార్టూన్లు వేశారని తెలిపారు.