Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ఈనెల 24, 25 తేదీల్లో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర 32వ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి సరోత్తం రెడ్డి, జి చెన్నకేశవరెడ్డి తెలిపారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్లోని జిల్లెలగూడలో ఈ సమావేశాలు ఉంటాయని చెప్పారు.
నేడు ట్రేటా వార్షిక కౌన్సిల్ ఎన్నికలు
తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అండ్ టీచర్స్ అసోసియేషన్ (ట్రేటా) వార్షిక కౌన్సిల్ సమావేశాలు చిక్కడపల్లిలో శుక్రవారం జరుగుతాయని ఆ సం ఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం హన్మంత్రెడ్డి, ఎన్ రాములు తెలిపారు.