Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తన మార్క్ కోసమే కొత్త సచివాలయ నిర్మాణం చేపడుతున్నారని మాజీ ఎంపీ వి హనుమంతరావు విమర్శించారు. కొత్త సచివాలయ నిర్మాణం వల్ల ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. ఆదివారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త సచివాలయం అవసరమా? కాదా? అనే అంశంపై ప్రజా బ్యాలెట్ నిర్వహించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగ రంలో మొత్తం 20 బ్యాలెట్ బాక్స్లు పెడుతున్నామని, తద్వారా ప్రజలు తమ నిర్ణయాన్ని తెలియజేయాలని కోరారు. 26న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, 27న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కౌంటింగ్ నిర్వహిస్తామని వీహెచ్ చెప్పారు.