Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక తెలంగాణతోనే సమన్యాయం
- పారిశ్రామికవేత్తలు, బంధువుల సేవలో రాష్ట్ర సర్కారు
- బతుకమ్మ చీరల పంపిణీలో అక్రమాలు: మెదక్, ఆదిలాబాద్ జిల్లాల టీమాస్ ఆవిర్భావ సభల్లో వక్తలు
నవతెలంగాణ - సంగారెడ్డి ప్రతినిధి /ఆదిలాబాద్ టౌన్
'వచ్చింది ఒట్టొట్టి తెలంగాణనే. ఇప్పుడున్నది దొరల తెలంగాణ. కావాల్సింది సామాజిక తెలంగాణ. దాంతోనే ప్రజలకు సమన్యాయం దక్కుతుంది. ఆ సామాజిక తెలంగాణ కోసం పోరాడటమే టీమాస్ ఫోరం లక్ష్యం' అని ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు అన్నారు. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల సామాజిక, ప్రజా సంఘాల ఐక్యవేదిక (టీ-మాస్) ఫోరం ఆవిర్భావ సభలు ఆదివారం జరిగాయి. మెదక్ జిల్లా సభలో 110, ఆదిలాబాద్ జిల్లా సభలో 40 ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. మెదక్ సభలో విశ్వేశ్వరరావు మాట్లాడుతూ...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సరళీకరణ, ప్రయి వేటీకరణ విధానాల వల్ల కార్మికులు, రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కుల దురహంకార దాడులు పెరిగి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆచరణకు సాధ్యం కాని హామీలనిచ్చి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రొఫెసర్ తిరుమలి మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు వెనకబడి ఉన్నారని, వారికి ప్రస్తుతం చేస్తున్న కేటాయింపులను కూడా సక్రమంగా అర్హుల కోసం ఖర్చు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీల సమస్యలపై ఒకే వేదికగా పోరాడేందుకు టీమాస్ ఆవిర్భవించి ందని తెలిపారు. పారిశ్రామికవేత్తలు, బంధువుల కోసమే టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తోందన్నారు. కిల్లె గోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర క్యాబినెట్లో ఒక్క మహిళా కూడా లేదని, దీన్ని బట్టే కేసీఆర్ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎంబీసీ జాబితాలో ఏయే కులాలను చేర్చాలో ఇప్పటికీ ప్రభుత్వం మార్గనిర్దేశకాలు ప్రకటించలేదని వాపోయారు. విభిన్న కులాలు, వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు టీమాస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. స్కైలాబ్ బాబు మాట్లాడుతూ పిట్టలదొర మాట లతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సీఎం సొంత జిల్లాలోనే దళితులకు మూడెకరాల భూమిని పూర్తి స్థాయిలో అందజేయలేదని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేండ్లలో 14 కుల దురహంకార హత్యలు జరిగాయని గుర్తుచేశారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ బతుకమ్మ చీరల్లో అక్రమాలు జరిగాయని, దానిపై ప్రభుత్వం స్వచ్ఛమైన గణంకాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ ఆవిర్భావ సభలో ఆశన్న, సుధాకర్, మల్లేశం, భూపతి, నర్సమ్మ మాట్లాడారు.
ఆదిలాబాద్ జిల్లా ఆవిర్భావ సభలో...
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ గార్డెన్స్లో టీ మాస్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు డి.మల్లేష్ అధ్యక్షతన జరిగిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. స్వేచ్ఛగా జీవించే హక్కును హరించేస్తున్నారన్నారు. వీటన్నింటిని ఎదుర్కోవాలంటే అందరూ ఏకం కావాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో బతుకమ్మ అంటే కవితమ్మగా మార్చేస్తున్నారని, తెలంగాణ కోసం పోరాడిన సమ్మక్క, సారక్క, చాకలి ఐలమ్మ విగ్రహాలకు బదులు తెలంగాణ విగ్రహాలు ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి అంటే ఇలా ఉంటుందని చెప్పి భ్రమలు కల్పిస్తున్నారని అన్నారు. బతుకమ్మ పేరుతో నాసిరకం చీరలు ఇచ్చి మహిళలను కించపర్చారన్నారు. కేసీఆర్ అధికా రంలోకి వచ్చి మూడున్నరేండ్లు గడుస్తున్నా దళితులకు మూడెకరాల భూమి ఇంత వరకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదన్నారు. ఇంటికో ఉద్యోగం అటకెక్కిందన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్న కంపెనీలపై కేసీఆర్ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తోడ్పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయ కుడు గద్దర్ ప్రభుత్వ విధానాలపై ప్రదర్శించిన నాటికలు ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో టీమాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ కన్వీనర్ జాన్వెస్లీ, సభ్యులు వంగూరి రాములు, భాస్కర్, సయ్యద్ జియావుద్దీన్, మౌలానా ఉస్మాన్, బండారి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.