Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంబీసీ సంఘం హర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎంబీసీ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలనుకోవడం పట్ల ఎంబీసీ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సమావేశం మరింత సమగ్రంగా, అర్ధవంతంగా జరగాలంటే బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు ఎంబీసీ, సంచార కులాలకు ప్రాతినిధ్యం వహించే సామాజిక శక్తులను కూడా ఆహ్వానించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ సుదర్శన్ రావు, పైళ్ల ఆశయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంబీసీల సమస్యల పట్ల అసెంబ్లీలో సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సున్నం రాజయ్య లేవనెత్తిన ప్రశ్నకు డిసెంబర్ 3న బీసీ ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రకటన బీసీలకు ఊరడింపు - జాజుల శ్రీనివాస్ గౌడ్
అసెంబ్లీ సమావేశాల్లో బీసీ, ఎంబీసీల సమస్యలపై చర్చించకున్నా, వారి అభివృద్ధి కోసం బీసీ ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పా టు చేయాలనుకోవడం బీసీలకు ఊరడింపు లాంటిదని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు.