Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్దతు ధరకు 7 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ధాన్యం చురుగ్గా కొనుగోళ్లు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు. శుక్రవారం పౌరసరఫరాల భవన్లో అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు కనీస మద్దతు ధరకు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసినట్టు చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా ఉండాలన్న ఉద్ధేశంతో రైతుల నుండి సేకరించిన ధాన్యానికి సంబంధించిన పూర్తి వివరాలను, కనీస మద్ధతు ధరకు సంబంధించిన చెల్లింపుల వివరాలు ఆన్లైన్లో నమోదే చేసే విధంగా గతేడా శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ సారి ఈ విధానాన్ని 31 జిల్లాలకు విస్తరించామన్నారు. ఆన్లైన్ చెల్లింపుల విధానం తెలుసుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, అధికారులు అధ్యయనం చేయడానికి వస్తున్నారని అన్నారు.