Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎవరి బలమెంతో ఎన్నికల్లో తేల్చుకుందాం..: మంత్రి హరీశ్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్పై ఎమ్మెల్యే గీతారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
నవతెలంగాణ - జహీరాబాద్
'మహిళలను గౌరవిం చకపోతే ఎక్కడైనా, ఎవరికైనా వినాశనం తప్పదు' అని మంత్రి హరీశ్రావును, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్నుద్దేశించి మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎవరి బలమెంతో ఎన్నికల్లో తేల్చుకుం దాం. చిల్లర రాజకీయా లు మానుకోవాలి' అని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. అంతకు ముందు కోహీర్ మండలం సజ్జపూర్ గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు. సభలో జహీరాబాద్ ఎమ్మెల్యే డా. జె.గీతారెడ్డి మాట్లాడుతూ.. జహీరాబాద్ కమ్యూనిటీ వైద్యశాలలోని డాక్టర్లందరినీ డిప్యూటేషన్పై పంపించడంతో రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. దీనిపై ఎమ్మెల్సీ ఎండీ.ఫరీదుద్దీన్ మాట్లాడుతూ.. 'ప్రజలపై ఇప్పుడు మీరు చూపిస్తున్న శ్రద్ధలో పది శాతమైనా మంత్రిగా ఉన్నప్పుడు చూపించి ఉంటే మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలపై ఇప్పుడు చూపిస్తున్న శ్రద్ధలో పది శాతమైనా చూపించి ఉంటే నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందేది' అని అన్నారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి వాగ్వావాదం జరిగింది. ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేశారు. చివరికి హరీశ్రావు కల్పించుకుని ఇద్దరిని సముదాయించడంతో సమావేశం సజావుగా సాగింది. అనంతరం జహీరాబాద్లో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే గీతారెడ్డి మంత్రిపై మాటల తూటా లు పేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేట అభివృద్ధి పనుల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు.