Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ
- టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల మూడున్నర కోట్ల భారం
- పాతబస్తీ అభివద్దికి ఎంఐఎం అడ్డుపడుతోంది
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎంఐఎం షరతుల కారణంగా ఇమ్లిబన్ నుంచి పలక్నామా వరకు డిజైన్ చేసిన మెట్రో రైలు మూడోదశను నిలిపివేసినట్టు తెలిసిందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే పనులు కొనసాగించాలని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. గురువారం గాంధీభవన్లో అబ్జలుద్దీన్, మాజీ కార్పొరేటర్ ఎండీ గౌస్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మెట్రో పనుల ఆలస్యంతోపాటు మూడున్నర వేలకోట్ల భారం పడిందన్నారు. మెట్రో రెండో దశ పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. అయినప్పటికీ 28వ తేదీన హైదరాబాద్కు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీతో ప్రారంభించబోతున్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం తేదీ ప్రకటించారని, రెండో విడత పనులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెట్రో రెండు, మూడు విడతల పనులు చేపడితే పాతబస్తీలో ఎంతో అభివద్ది చెందే అవకాశముందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాత బస్తీని అభివద్ది చేసేందుకు పదేండ్ల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. అక్కడ ఉన్న ఎంఐఎం పాతబస్తీ అభివద్ది కాకుండా అడ్డుపడుతుందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో పాతబస్తీ మెట్రో రైలు గురించి ప్రస్తావించాలని డిమాండ్ చేశారు.
సొంతూరు రైతును పరామర్శించరా? : వీహెచ్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సొంతూరు చింతమడకలో దళిత రైతు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకునే పరిస్థితిలేదని మాజీ ఎంపీ వి హనుమం తరావు చెప్పారు. అధికారులు...పోలీసులు ఇంతవరకు ఆ కుటుంబాన్ని పట్టించు కోవడం లేదన్నారు. స్వంత గ్రామంలో జరుగుతున్న ఆత్మహత్యలనే పట్టించుకోని కేేసీఆర్ ఇక రాష్టాన్ని ఏం పట్టించుకుంటారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకు రూ 2 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు మెదక్ ఎంపీ అభ్యర్థి శ్రవణ్ కుమార్ రెడ్డి రైతు కుటుంబానికి లక్ష రూపాయాలు ఇచ్చారని చెప్పారు.రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు.
రేవంత్పై విమర్శలు చేసే స్థాయి పల్లాకు లేదు : అద్దంకి దయాకర్
కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి పల్లా రాజేశ్వరరెడ్డికి లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. విమర్శలు చేసే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గురువారం గాంధీభవన్లో సీనియర్ నేత కత్తి వెంకటస్వామితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. డబ్బు ఉందని అహంకారంలో మాట్లాడితే ప్రజలు సహించబోరన్నారు. లేకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేని దద్దమ్మ స్పీకర్ అన్నారు. స్పీకర్ కండ్లు ఉందని చూడలేని కబోదిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆ తర్వాతనే రేవంత్రెడ్డి రాజీనామాపై మాట్లాడాలన్నారు. పద్మావతి సినిమాపై రాద్ధాంతం చేస్తున్న బీజేపీ నేతలకు హైదరాబాద్ నడిబొడ్డులో ఇంత బరితెగించి నిర్వహిస్తున్న సన్ బర్న్ పార్టీలు కలిపించడం లేదా? అన్నారు. తెలంగాణా ఆడపడుచులకేమో యాభై రూపాయల చీరలు... ఇవాంక కేమో వజ్రాభరణాలా అని ఎద్దేవా చేశారు.